అలనాటి కథలు
అర్ధరాత్రి అతిధి
అర్ధరాత్రి 2 గంటలు దటి వుంటుంది. మా అమ్మగారు 'దొంగ... దొంగ' అని అరుస్తున్నారు. ఏమిటనడగ్గా ఎవరో ఆవిడ మెడ మీద చేయి వేశారని చెప్పారు. నేనుకైడ ఆరుస్తూ లైటు స్విచ్ కోసం చూస్తూ వుండగా, ఎవరో మేడ మెట్లుక్కుతున్న చప్పుడయింది. నేను లైటు వేసి, మా నాన్నగారితో కలిసి మేడ ఎక్కాను. కర్ర పట్టుకొని మేడంతా ఎదికాం. ఎక్కడా దొంగ అనేవాడు కన్పించలేదు. క్రిందకు దిగివచ్చి ఏమైనా వస్తువులు పోయాయేమోనని ఒకసారి యిల్లంతా చూశాం. అన్నీ ఎక్కడివక్కడే వున్నాయి. కాని మా అమ్మగారు తల దగ్గిరగా గ్లాసుతో పాలు పెట్టుకు పడుకున్నారు. అవి మాత్రం ఒలికిపోయి ఉన్నాయి. మాకేం అంతు చిక్కలేదు. దొంగ ఎవరో ? మీకైనా తెలిసిందా?
........వేముల కొండ
చిత్రగుప్త సౌజన్యంతో 1955